Saturday, September 21, 2024

ఎపిలో మరో 458 మందికి కరోనా

- Advertisement -
- Advertisement -

458 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్-19 కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 69,062 కరోనా పరీక్షలు చేయగా 458 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో 534 మంది కోలుకున్నారు. కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు 7,070కి చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,77,806కి చేరింది. ఇప్పటివరకు 8,66,359 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,377 యాక్టివ్ కేసులున్నాయి.  కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 98 కేసులు బయటపడ్డాయి. కృష్ణాలో 78, తూర్పు గోదావరిలో 54, గుంటూరులో 41 కేసులు నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది.

458 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News