Friday, September 20, 2024

కోడి కూర కోసం హత్య

- Advertisement -
- Advertisement -

Person murder over chicken curry in Vijaya nagaram

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా భోగాపురం మండలం గుడివాడ గ్రామంలో కోడి కూర కోసం ఓ వ్యక్తిని హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కాకి అప్పన్న, దర్మపు రమణ, నక్క ప్రసాద్, బొద్దాన ఆదినారాయణ, శోట్యాన శ్రీను అనే వ్యక్తులు మేస్త్రీ తివనాల రమణ దగ్గర భవన కార్మికులుగా పని చేస్తున్నారు. పాపయ్య అనే మహిళ వీరికి అన్నం వండిపెడుతోంది. శుక్రవారం ఆమె కోడి కూరతో భోజనం తయారు చేసి తాను ఇంటికి వెళ్లిపోయింది. బయటవెళ్లిన ఐదుగురు కార్మికులు నిర్మాణం జరుగుతున్న భవనం దగ్గర భోజనం చేయడానికి రెడీ అయ్యారు. భోజనం చేస్తుండగా ప్రసాద్, అప్పన్నల మధ్య కోడి కూర కోసం గొడవ జరగడంతో ప్రసాద్ కర్ర తీసుకొని అప్పన్నపై దాడి చేశాడు. మిగిలిన ముగ్గురు అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు వారిపై కూడా దాడి చేయడంతో వారు పారిపోయారు. అక్కడే పాడిపోయిన అప్పన్న తలపై పలుమార్లు కర్రతో కొట్టడంతో ఘటనా స్థలంలో అతడు చనిపోయాడు. వెంటనే ప్రసాద్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News