Friday, September 20, 2024

కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్‌కు ప్రధాని మోడీ పరామర్శ

- Advertisement -
- Advertisement -

PM Modi Spoke to Union minister Shripad Naik

పనాజీ: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇక్కడి గోవా మెడికల్ కాలేజ్, ఆసుపత్రిలో కోలుకుంటున్న కేంద్ర మంత్రి శ్రీపాద్ నాయక్‌ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఫోన్‌లో పరామర్శించారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఆసుపత్రిలో నాయక్‌ను కలవడానకి కొద్ది నిమిషాల ముందు ప్రధాని మోడీ నాయక్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు నాయక్ కార్యాలయం తెలిపింది. గత సోమవారం రాత్రి పొరుగున ఉన్న కర్నాటకలో కారు ప్రమాదంలో నాయక్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన సతీమణితోపాటు కారు డ్రైవర్ మరణించారు. శుక్రవారం ఉదయం 10.20 గంటల ప్రాంతంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసుపత్రిలో నాయక్‌ను కలుసుకుని ఆయనను పరామర్శించారు. కాగా.. నాయక్‌తో టెలిఫోన్‌లో మాట్లాడిన ప్రధాని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిందిగా సూచించినట్లు నాయక్ కార్యాలయ ఓఎస్‌డి సూరజ్ నాయక్ తెలిపారు. నాయక్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని జిఎంసిహెచ్ గురువారం సాయంత్రం ప్రకటించింది. ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ వైద్య బృందం నాయక్‌కు అందచేస్తున్న వైద్య చికిత్సలను పర్యవేక్షిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News