Friday, September 20, 2024

కిమ్స్ ఆస్పత్రిలో కరోనా రోగి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Corona Patient suicide in Kondapur KIMS Hospital 

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడు బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిరిసిల్లా జిల్లా వేములవాడకు చెందిన నారాయణ(77) జ్వరం, దగ్గుతో బాధపడడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 13వ తేదీన కరోనా పరీక్ష చేయించారు. పరీక్షలో పాజిటివ్ రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు కొండాపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.

కానీ, నారాయణకు ఆస్పత్రిలో ఉండడం ఇష్టం లేకపోవడంతో తాను ఇక్కడ ఉండనని ఇంటికి వెళ్లిపోతానని వైద్యులకు చెప్పాడు. దీంతో వైద్యులు నారాయణ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రికి చేరుకునేలోపే వృద్ధుడు ఆస్పత్రి రెండో అంతస్థులో ఉన్న కిటికీలో నుంచి కిందికి దూకి దూకాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో నారాయణ అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న మాదాపూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతిడి మరణానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నారు.

Corona Patient suicide in Kondapur KIMS Hospital 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News