Friday, October 18, 2024

100వ టెస్టులో జోరూట్ డబుల్ సెంచరీ..

- Advertisement -
- Advertisement -

చెన్నై: టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్ డబుల్ సెంచరీ తో కదం తొక్కాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరు సాధించింది. రూట్ మొత్తం 341 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సుల సహాయంతో 200 పరుగులతో అదరగొట్టాడు. తన కెరీర్ లో వందో టెస్టు ఆడుతున్న రూట్ డబుల్ సెంచరీ చెలరేగాడు. దీంతో ఐదోసారి ఈ ఘనత సాధించాడు. ఇక, రూట్ తోపాటు పోప్(23) కూడా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అంతకుముందు బెన్ స్టోక్స్(82) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దీంతో ఇంగ్లండ్ 146 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 449 పరుగులు చేసింది. మరోవైపు వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Joe Root hits Double Century against India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News