Friday, October 18, 2024

ఏనుగులపై ఊరేగుతూ సామూహిక పెళ్లిళ్లు..

- Advertisement -
- Advertisement -

52 couples were Married sitting on Elephants

 

బ్యాంకాక్‌ : ఏనుగులపై ఊరేగుతూ సామూహిక వివాహం చేసుకున్నారు. వాలంటైన్స్‌ డే సందర్భంగా ఆదివారం బ్యాంకాక్‌ దక్షిణ ప్రావిన్స్‌లోని బొటానికల్‌ గార్డెన్స్‌లో సామూహిక వివాహ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. థాయిలాండ్‌కు చెందిన 52 జంటలు ఏనుగులపై కూర్చోని వివాహం చేసుకున్నారు. స్థానిక అధికారులు సైతం ఏనుగులపైనే ఆశీనులై పెళ్లి చేసుకున్న జంటలకు వివాహ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ వేడుక కోసం చాలాకాలంగా ఎదురుచూశామని.. ఈ కార్యక్రమం చాలాగొప్పగా ఉందని నూతన జంటలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News