Friday, October 18, 2024

వరుసగా ఎనిమిదో రోజు పెరిగిన పెట్రోల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol and Diesel prices Hiked for eighth day

హైదరాబాద్: దేశంలో పెట్రోల్ ధరలు వరుసగా ఎనిమిదో రోజు పెరిగాయి. చమురు సంస్థలు మంగళవారం పెట్రోల్, డీజిల్ పై 38 పైసల వరకు పెంచాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.89.29, డీజిల్ రూ.79.70కి చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.95.75, డీజిల్ రూ.86.72 చేరింది. గత 46 రోజులుగా ముడి చమురు ధరలు 20 శాతం వరకు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల మార్పులతో దేశంలో ధరలు పెరుగుతున్నాయని నిఫుణులు అంటున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ పై సుమారు రూ.6 పెరిగింది.

Petrol and Diesel prices Hiked for eighth day

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News