Saturday, October 19, 2024

థ్రిల్‌గా ఫీలై చేశా

- Advertisement -
- Advertisement -

Sashi movie to Release on March 19

ధనుష్ సరసన ‘రఘువరన్ బీటెక్’లో నటించి… ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామ సురభి. బీరువా, ఎక్స్‌ప్రెస్‌రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్, ఒక్కక్షణం, ఓటర్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆది సాయికుమార్ హీరోగా సురభి హీరోయిన్‌గా శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శశి’. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి.వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సురభి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “దర్శకుడు చెప్పిన కథ వినగానే చాలా థ్రిల్‌గా ఫీలై ఈ సినిమాకు సైన్ చేశాను. ఈ సినిమా రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు. ఎమోషన్స్‌తో కూడిన డిఫరెంట్ లవ్ స్టోరీ.

ఈ సినిమాలో నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర నాది. ఇందులో రాజీవ్ కనకాల నా తండ్రి. ఒక్క కూతురినే కాబట్టి చాలా గారాబంగా పెంచుతాడు. అయితే నేను మా పేరెంట్స్‌కి ఒక్క కూతురినే. అందుకే ఈ సినిమాలో నా పాత్రతో వెంటనే కనెక్ట్ అయ్యాను. సినిమా క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఇందులో హీరో ఆదికి మ్యూజికల్ బ్యాండ్ ఉంటుంది. గిటార్ ప్లే చేస్తాడు. ఆదితో మొదటిసారి కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, వైవా హర్ష పాత్రలు హిలేరియస్‌గా ఉంటాయి. ఇప్పుడు తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కన్నడలో డెబ్యూ మూవీ ‘సకత్ ’ చేస్తున్నాను. తెలుగులో రెండు స్క్రిప్ట్ విన్నాను. త్వరలో వాటి గురించి తెలియజేస్తా” అని అన్నారు.

Sashi movie to Release on March 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News