Saturday, September 28, 2024

భారత్ లక్ష్యం 165

- Advertisement -
- Advertisement -

England hits 164 runs against India in 2nd T20

అహ్మదాబాద్: టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు సాధించింది. దీంతో ఇంగ్లండ్ జట్టు టీమిండియాకు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ జట్టుకు శుభారంభం దక్కలేదు. భారత్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుత బంతితో ఓపెనర్ బట్లర్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన డేవిడ్ మలాన్ తో కలిసి మరో ఓపెనర్ జాసన్ రాయ్ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో భారీ షాట్ యత్నించిన మలాన్, చాహల్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత రాయ్(46) కూడా పెవిలియన్ చేరాడు. బెయిర్ స్టో(20), కెప్టెన్ మోర్గాన్(28), బెన్ స్టోక్స్(24)లు పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్, చాహాల్ లు చెరో వికెట్ తీశారు.

England hits 164 runs against India in 2nd T20

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News