- Advertisement -
నల్లగొండ: నాగర్జునసాగర్ ఉపఎన్నికలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతంది. మధ్యాహ్నం 3 గంటల వరకూ 69 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఎండ కాస్త తగ్గడంతో పోలింగ్ కేంద్రాల వద్దకు భారీగా ఓటర్లు చేరుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు సాధారణ ఓటర్లకు అనుమతించనున్నారు. ఇక ఆరు గంటల తర్వాత కరోనా బాధితులకు ఓటేసేందుకు అవకాశం ఇవ్వనున్నారు. సాగర్ పోలింగ్ ఉదయం 7గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది. సాగర్ నియోజకవర్గంలో 2,20,300 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలో టిఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, బిజెపి నుంచి రవికుమార్ నాయక్ సహా మొత్తం 41 మంది బరిలో ఉన్నారు.
Nagarjuna Sagar by election 2021
- Advertisement -