- Advertisement -
ముంబయి: షీనాబోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణీముఖర్జీతోపాటు బైకుల్లా జైలులోని మరో 39మంది మహిళా ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో క్వారంటైన్ కేంద్రానికి తరలించినట్టు అధికారులు తెలిపారు. వీరిలో అధికభాగం అసింప్టమేటిక్ అని వారు పేర్కొన్నారు. ఆదివారం అదే జైలులోని ఓ మహిళా ఖైదీకి కరోనా నిర్ధారణ కావడంతో, ఆ తర్వాత అందరికీ పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. 350మందికి పరీక్షలు నిర్వహించగా 40మందికి కరోనా సోకినట్టు తేలిందన్నారు. 2012లో తన కూతురు షీనాబోరాను హత్య చేసిన కేసులో ఇంద్రాణీతోపాటు ఆమె మాజీ భర్తలు సంజీవ్ఖన్నా, పీటర్ముఖర్జీ నిందితులు. ఈ కేసులో 2015 ఆగస్టు నుంచి ఇంద్రాణీ సెంట్రల్ ముంబయిలోని బైకుల్లా జైలులో ఉంటున్నారు.
- Advertisement -