Friday, September 20, 2024

భారత్ @ 4.14 లక్షల కరోనా కేసులు….

- Advertisement -
- Advertisement -

4.14 Lakh corona positive case registered in India

ఢిల్లీ: దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. గత కొన్ని రోజుల నుంచి రోజుకు మూడు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా దాటికి భారత్ చిగురుటాకుల వణికిపోతుంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. గత 24 గంటల్లో 4.14 లక్షల కరోనా కేసులు నమోదుకాగా 3915 మంది మృత్యువాతపడ్డారు. భారత్ కరోనా కేసుల సంఖ్య 2.14 కోట్లుకు చేరుకోగా 2.34 లక్షల మంది చనిపోయారు. కరోనా వ్యాధి నుంచి 1.76 లక్షల మంది కోలుకోగా 36.45 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 16.49 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 18.26 లక్షల మంది కరోనా టెస్టులు చేయగా మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 29.86 కోట్లకు చేరుకుందని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News