Friday, September 20, 2024

మాజీ గవర్నర్ భాటియా కన్నుమూత

- Advertisement -
- Advertisement -

ఛండీఘడ్ : పంజాబ్ రాష్ట్రంలో మాజీ గవర్నర్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఆర్‌ఎల్‌. భాటియా (100) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తీవ్ర అసౌకర్యానికి గురికావడంతో కుటుంబీకులు అమృత్‌సర్‌లోని ఫోర్టిస్ హాస్పిటల్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో భాటియా చనిపోయారు. అమృత్ సర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎంపిగా గెలిచారు. 2004 నుంచి 2008, 2008 నుంచి 2009 వరకు కేరళ గవర్నర్ గా పని చేసి ప్రజలకు సేవలందించారు. జులై 3వ తేదీలో భాటియా 101 ఏండ్లు నిండుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News