Monday, September 30, 2024

గుర్రం అంత్యక్రియలకు వందలాది మంది (వీడియో)

- Advertisement -
- Advertisement -

Hundreds of people were seen at funeral of horse

బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో వందలాది మంది కోవిడ్-19 లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారు. కరోనాను లెక్కచేయకుండా గుర్రం అంత్యక్రియల్లో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. నిబంధనలు ఉల్లంఘించడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరాడిమఠ్ గ్రామంలో అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. మరణించిన గుర్రం బెళగావిలోని ఒక మత సంస్థకు చెందినది. గ్రామ ప్రజలు అంత్యక్రియలు చేపట్టి గుర్రానికి దహన సంస్కారాలు చేశారు.  మాస్కులు లేకుండా చాలా మంది హాజరయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసు కేసు నమోదు చేశారు. కొత్త కోవిడ్ కేసులను తనిఖీ చేయడానికి జిల్లా అధికారులు గ్రామానికి తాత్కాలికంగా సీజ్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News