Thursday, October 24, 2024

ఆహారం ఇస్తామని.. అంబులెన్స్‌లో అత్యాచారం

- Advertisement -
- Advertisement -

22 year old gang raped in ambulance in Jaipur

భోపాల్: మహిళకు ఆహారం ఇస్తామని ఆశచూపించి అంబులెన్సులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి చేసిన దారుణ సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే… 22 ఏళ్ల ఓ మహిళపై అంబులెన్స్ డ్రైవర్, అతని మిత్రుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మోతీ దూంగ్రీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) సురేంద్ర పంచోలి తెలిపారు. ఈ సంఘటన సోమవారం జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసి సెక్షన్ 376డి(గ్యాంగ్ రేప్)తో పాటు ఎస్.సి, ఎస్.టి కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మహిళ స్టేట్మెంట్ రికార్డ్ చేయబడిందని, ఆమె వైద్య పరీక్షలు జరిగాయని ఎస్‌హెచ్‌ఓ  చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News