లక్నో: స్నేహితులతో బయటకు వెళ్లిన యువతిపై ఏడుగురు గ్యాంగ్ రేప్ చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరేలీలో జరిగింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ దళిత యువతి ఇద్దరు అబ్బాయిలతో కలిసి ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లింది. మార్గం మధ్యలో వారిని ఒకరు బెదిరించి వాహనం ఆపాడు. మరో ఐదుగురు స్నేహితులను అక్కడికి రప్పించి అమ్మాయి స్నేహితులను తరిమేశారు. తరువాత యువతిపై ఏడుగురు సామూహిక అత్యాచారం చేశారు. తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా తన సోదరికి జరిగిన అవమానాన్ని చెప్పింది. వెంటనే వాళ్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. అరెస్టైన వారు విశాల్ పటేల్, అనుజ్ పటేల్గా గుర్తించారు. అత్యాచారం జరుగుతున్నప్పుడు వికాస్ అనే వ్యక్తి వీడియో తీశాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
దళిత యువతిపై గ్యాంగ్ రేప్….
- Advertisement -
- Advertisement -
- Advertisement -