పాత కేసు వాపస్ తీసుకోవాలని ఒత్తిడి చేసిన బాధితుడు
హైదరాబాద్: ఈ నెల 7వ తేదీన హత్య చేసిన ఇద్దరు తండ్రికుమారులను కాలాపత్తర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. సయిద్ ముకరం చున్నీకి భట్టి, మిసిరిగంజ్లో హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సయిద్ అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న కాలాపత్తర్ పోలీసులు నిందితులు తండ్రి, కుమారుడు మహ్మద్ అర్బజ్(20) విద్యార్థి, తండ్రి ఎండి హమిద్ ఖాన్ అలియాస్ అహ్మద్ ఖాన్ను అరెస్టు చేశారు. గతంలో ఎండి హమిద్ ఖాన్ కూతురును సయిద్ వెంటపడి వేధించేవాడు. అంతేకాకుండా హమిద్ ఖాన్ కిడ్నాప్ చేసి దుస్తులు ఊడదీసి కొట్టాడు. దీంతో సయిద్పై నిందితుడు కోపం పెంచుకున్నాడు. ఇరువురు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడంతో కేసులు నమోదు చేశారు. గత ఐదు రోజుల నుంచి కేసు విషయంలో రాజీకుదుర్చుకోవాలని సయిద్ నిందితులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో విసుగు చెందిన నిందితులు కత్తులతో పొడిచి చంపివేశారు. ఇన్స్స్పెక్టర్ సుదర్శన్,తదితరులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు.