లక్నో: ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని ఇక్కడి సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య శాస్త్రాల సంస్థ మంగళవారం తెలిపింది. కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని, ఆయన ముఖ్య అవయవాల పనితీరును వైద్య నిపుణులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందికరంగా మారడంతో ఆయనను వెంటిలేటర్పైన ఉంచి చికిత్స అందచేస్తున్నట్లు ఆసుపత్రి తెలిపింది.
రోజువారీగా ఆయన ఆరోగ్య పరిస్థితిని సంస్థ డైరెక్టర్ ఆర్ ధిమన్ నిశితంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. క్రిటికల్ కేర్ మెడిసిన్, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఎండోక్రైనాలజీ విభాగాలకు చెందిన సీనియర్ ఫ్యాకల్టీ కల్యాణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని ఆసుపత్రి తెలిపింది. ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న 89 సంవత్సరాల కల్యాణ్ సింగ్ను జులై 4న ఆసుపత్రిలోని ఐసియులో చేర్చారు. ఆ తర్వాత ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. రాజస్థాన్కు మాజీ గవర్నర్ కూడా అయిన కల్యాణ్ సింగ్ గతంలో ఇక్కడి డాక్టర్ రాం మనోహర్ లోహియా వైద్య శాస్త్రాల సంస్థలో కూడా చికిత్స పొందారు.
UP’s Former CM Kalyan Singh health condition is not stable