మన తెలంగాణ/హైదరాబాద్ /నాంపల్లి : నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికయినట్లు ఆ సోసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు కమిటీ సభ్యులు శనివారం మంత్రి హరీశ్ రావును నివాసంలో కలిసి ధన్యవాదాలు తె లిపారు. ఎగ్జిబిషన్ సోసైటీని మరింత ప్రగ తి పథంలో నడిచేలా శక్తివంచన లేకుండా పని చేస్తానని తనను కలిసిన సోసైటీ యాజమాన్య కమిటీ ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రస్తుతం తన బాధ్యత మ రింత పెరిగిందన్న ఆయన ప్రతిష్టాత్మక సం స్థను అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామన్నారు. గత 80సంవత్సరాలుగా ఆల్ ఇ ండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ఘనం గా నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కె సిఆర్ సహకారంతో నుమాయిష్ ను విశ్వవ్యాప్తం గా గుర్తింపు పొందేలా కలిసి పని చేద్దామన్నారు. సోసైటీ ఆ ధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నా ణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి పొందేలా చేద్దామన్నారు.