Friday, September 20, 2024

మూడు రోజులపాటు సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మూడు రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1, 2021 మధ్యాహ్నం హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి  సీఎం కేసీఆర్ బయల్దేరి వెళ్లనున్నారు. సెప్టెంబర్ 2, 2021 మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భూమి పూజ చేయనున్నారు. సిఎం కెసిఆర్ తోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భూమిపూజ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొననున్నారు. సెప్టెంబర్ 3, 2021 మధ్యాహ్నం సిఎం కెసిఆర్ తిరిగి  హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ పక్కన పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం 1300ల గజాల స్థలాన్ని  కేంద్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.

CM KCR go to Delhi on Sep 1

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News