- Advertisement -
కరీంనగర్ : మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ కు జమ్మికుంటలో ఓ యువకుడు షాకిచ్చాడు. ఈటల తరపున పంచి పెట్టిన వాల్ క్లాక్ పగలగొట్టి గొడుగులను చింపేసి ఓ యువకుడు నిరసన తెలిపాడు. ఆదివారం జమ్మికుంటలో మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ హాజరైన ఓ సభలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈటల రాజేందర్ ఇస్తున్న గడియారాలు , గొడుగులు ఆర్ధిక భరోసానిస్తాయా అని సదురు యువకుడు ప్రశ్నించాడు. దళిత వాడల్లో గడియారాలు, గొడుగులు పంచిపెడితే నిరాకరించానని వివరించాడు.
- Advertisement -