- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మను నియమించారు. ప్రస్తుత సిఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం ఈ నెలతో ముగియనుండడంతో ప్రభుత్వం కొత్త సిఎస్గా సమీర్ శర్మను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30న ఆదిత్యానాథ్ దాస్ పదవీ విరమణ చేయనుండగా అక్టోబర్ 1వ తేదీ నుంచి సిఎస్గా సమీర్శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. 1985 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ శర్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆప్కో సీఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ప్లానింగ్ అండ్ రిసోర్స్ మొబలైజేషన్ స్పెషల్ సిఎస్గా విధులు నిర్వహిస్తున్నారు. ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ విషయం తెరపైకి వచ్చినప్పటి నుంచి పలువురు పేర్లను పరిశీలించిన ఎపి ప్రభుత్వం చివరకు సమీర్ శర్మ నియామకానికి మొగ్గు చూపింది.
- Advertisement -