Friday, September 20, 2024

ముంబై డ్రగ్స్ కేసులో మరో వ్యక్తి అరెస్టు..

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబై క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో ఎన్సిబి దూకుడు పెంచింది. సోమవారం రాత్రి మరో వ్యక్తిని ఎన్సిబి అధికారులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి డ్రగ్స్, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. కాగా, డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 11మందిని ఎన్సిబి అధికారులు అరెస్టు చేశారు. ఇందులో బాలీవుడ్ సూపర్ స్టార్ కొడుకు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ కు బెయిల్ నిరాకరించిన కోర్టు 7వ తేదీ వరకు కష్టడి విధించింది. దీంతో ఈ రోజు ఆర్యన్ ఖాన్ ను ఎన్సిబి అధికారులు విచారించనున్నారు.

Odisha man arrested by NCB in Drugs Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News