Saturday, September 21, 2024

నేటి నుంచి వచ్చే నెల వరకు ప్రత్యేక వీక్లి రైళ్లు

- Advertisement -
- Advertisement -

ప్రయాణికులకు అందుబాటులోకి ప్రత్యేక వీక్లి రైళ్లు

Weekly trains for passengers
మనతెలంగాణ/హైదరాబాద్:  దసరా పండుగను పురస్కరించుకొని ప్రయాణికుల కోసం దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక వీక్లి రైళ్లను నడిపించనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రత్యేక వీక్లి రైళ్లు అందుబాటులోకి వస్తే వివిధ ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు సౌలభ్యంగా ఉంటుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖపట్నం టు సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 08579) 13, 20, 27వ తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. దీంతోపాటు సికింద్రాబాద్ టు విశాఖపట్నం (నెంబర్ 08580) 14, 21, 28వ తేదీల్లో, విశాఖపట్నం టు తిరుపతి (నెంబర్ 08583) 18, 25వ తేదీల్లో, తిరుపతి టు విశాఖపట్నం (08584) 19, 26వ తేదీల్లో, విశాఖపట్నం టు సికింద్రాబాద్ (నెంబర్ 08585) 19, 26వ తేదీల్లో, సికింద్రాబాద్ టు విశాఖపట్నం (08586) 20, 27వ తేదీల్లో, చెన్నై సెంట్రల్ టు శాంతగుర్జ్ (06036) 12, 19, 26, వచ్చే నెల 11వ తేదీల్లో, శాంతగుర్జ్ టు చెన్నై సెంట్రల్ (06035) 13, 20, 27, వచ్చే నెల 03వ తేదీల్లో అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. వీటితో పాటు మరికొన్ని రైళ్లు కూడా ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొస్తామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News