Saturday, September 21, 2024

యూపీలో మహిళల కోసం కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో

- Advertisement -
- Advertisement -

Priyanka Gandhi
లక్నో: రానునున్న ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలకు మహిళల కోసం కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. అంతేకాక తమ పార్టీని అధికారంలోకి తెస్తే తమ ప్రభుత్వం ఉచిత ఎల్‌పిజి సిలిండర్లు, ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందించగలదని కూడా వాగ్దానం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి కూడా అయిన ప్రియాంక గాంధీ గత నెల ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టిక్కెట్లు ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించారు. వచ్చే ఏడాది(2022) పూర్వార్ధంలోనే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయన్నది ఇక్కడ గమనార్హం. ఓటు బ్యాంకులో సగం ఉన్న మహిళలను అధికారంలో భాగస్వాములను చేయడమే తమ పార్టీ లక్షం అని కూడా ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News