- Advertisement -
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. పార్లమెంటరీ సాంప్రదాయాల పరిరక్షణలో ఓం బిర్లా విశేష కృషి చేస్తున్నారని ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసించారు. రాజస్థాన్లోని కోట-బుండి లోక్సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓం బిర్లా 1962లో జన్మించారు. పార్లమెంటరీ నియమనిబంధనలపై అపార జ్ఞానం కలిగిన ఓం బిర్లా సభా కార్యకలాపాలను సజావుగా నిర్వహించడంలో అందరి మన్ననలు చూరగొన్నారంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
- Advertisement -