- Advertisement -
బిజెపి, ప్రతిపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలు
న్యూఢిల్లీ: సస్పెన్షన్కు గురైన 12 మంది ప్రతిపక్ష రాజ్యసభ సభ్యులు శుక్రవారం పార్లమెంట్ వెలుపల నిరసన తెలియచేస్తుండగా అక్కడకు అధికార బిజెపి సభ్యులు చేరుకుని పోటీగా నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్తత తలెత్తింది. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష సభ్యులు ధర్నా చేస్తుండగా ప్లకార్డులు ధరించిన బిజెపి సభ్యులు అక్కడకు చేరుకుని సభలో ప్రతిపక్ష సభ్యుల అప్రజాస్వామిక చర్యలను ఖండిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రతిపక్ష సభ్యుల ద్వంద్వ వైఖరిని ఖండించడానికే తాము ఇక్కడకు వచ్చామంటూ బిజెపి సభ్యుడు జివిఎల్ నరసింహారావు తెలిపారు. అనంతరం బిజెపి సభ్యులు ప్రజాస్వమ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు ఊరేగింపు నిర్వహించారు.
- Advertisement -