- Advertisement -
చంఢీగర్: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున హర్యానాలోని అంబాలా-ఢిల్లీ హైవేపై హీలింగ్ టచ్ ఆస్పత్రి సమీపంలో ప్రయాణికులతో ఓ ట్రావెల్స్ బస్సును వెనకాల వేగంగా వచ్చిన మరో బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
5 Killed in Road Accident in Haryana
- Advertisement -