Friday, October 18, 2024

రాష్ట్రంలో కొత్తగా 2,983 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -
2983 new Covid-19 Cases Reported in Telangana
గ్రేటర్‌లో అత్యధికంగా 1,206 కేసులు నమోదు
గడిచిన 24 గంటల్లో 1,07,904 మందికి పరీక్షలు

హైదరాబాద్ : రాష్ట్రంలో కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,07,904 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,983 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,14,639కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మొత్తం కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 1,206 కేసులు నమోదయ్యాయి.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డి జిల్లాలో 227 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 4,062కు చేరింది. తాజాగా కరోనా నుంచి 2,706 మంది కోలుకోగా, ఇప్పటివరకు 6,88,105 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.29 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.57 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరో 13,895 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News