Thursday, September 19, 2024

బీజాపూర్ జిల్లాలో కూతురు, కుటుంబం కోసం మహిళా నక్సలైట్ లొంగుబాటు

- Advertisement -
- Advertisement -

woman naxalite surrender
బీజాపూర్: పోలీసులపై దాడికి పాల్పడిన పలు కేసుల్లో  ఐదు లక్షల రూపాయల రివార్డున్న ఓ మహిళా నక్సలైట్ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో లొంగిపోయింది. ఆమె తన కుమార్తె కోసం, కుటుంబం కోసం లొంగిపోయింది. ఆమెను
సోమ్లీ సోడి అలియాస్ వనిత (32) గా గుర్తించారు. 2003 నుండి నిషేధిత సంస్థలో పనిచేస్తున్నట్లు,  2018 నుండి నాగారం స్థానిక సంస్థ స్క్వాడ్‌కు కమాండర్‌గా ఉన్నట్లు తెలిసింది. ఆమె తన కుమార్తె , కుటుంబ సభ్యుల కోసం శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయిందని బీజాపూర్ పోలీస్ సూపరింటెండెంట్ ఆంజనేయ వర్ష్నే తెలిపారు.

బీజాపూర్‌కు చెందిన తిరుగుబాటుదారుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, మావోయిస్ట్ భావజాలం, విచక్షణారహిత ప్రవర్తన, వేధింపులు, కుటుంబం పట్ల ప్రేమానురాగాలు నక్సల్ ఉద్యమం నుండి వైదొలగడానికి కారణాలుగా పేర్కొన్నారని ఆ అధికారి తెలిపారు.
2004లో అవపల్లి-ఇల్మిదిహ్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు భద్రత కల్పించే పనిలో నిమగ్నమైన పోలీసు సిబ్బందిపై దాడి చేసిన నక్సల్ టీమ్‌లో ఆమె కూడా ఉంది. 2006లో ఆవపల్లి వద్ద పోలీసు సిబ్బందిపై కాల్పులు జరిపి, 2007లో భద్రతా బలగాల రాణి బోడ్లీ క్యాంపుపై దాడి మరియు ఇతర సంఘటనల తర్వాత ఐఇడి  పేలుడుకు కారణమైన తిరుగుబాటు బృందంలో ఆమె కూడా భాగమని అధికారి తెలిపారు. శనివారం వనిత ఆయుధాలు వదిలివేసిన తర్వాత ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం సరెండర్ అండ్ రిహాబిలిటేషన్ పాలసీ కింద రూ.10,000 నగదు సాయం అందించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News