Saturday, April 12, 2025

జూపార్క్… నీట మునిగిన సఫారీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారీ వర్షాలు కురుస్తుండడంతో మీరాలం చెరువు నిండుకుండలా మారింది. గత నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండడంతో జవహర్ లాల్ నెహ్రూ జూపార్క్ జలమయంగా మారడంతో పాటు సఫారి నీట మునిగింది. మీరాలం ట్యాంక్ చెరువు నుంచి సఫారీలోకి భారీగా వరద నీరు చేరుతోంది. జూ సిబ్బంది సఫారీలోని జంతువులను ఎన్‌క్లోజర్లలోకి పంపుతున్నారు. గత ఆరేళ్లుగా మీరాలం ట్యాంక్ ఓవర్ ఫ్లోతో సఫారీ మూసివేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News