Wednesday, October 23, 2024

పాల ఉత్పత్తులపై జిఎస్‌టిని ఎత్తి వేయాలి

- Advertisement -
- Advertisement -

GST should be lifted on milk products

పాలు, పాల అనుబంధ ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వ జిఎస్‌టిని ఎత్తివేయాలి. కేంద్ర ప్రభుత్వం వస్తువులు, సేవల మీద పన్నులు విధించి జిఎస్‌టి పేరుతో వినియోగదారులపై, అదే విధంగా ప్రజలపై పన్ను భారాన్ని మోపుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జూన్ 28, 29 తేదీలలో జరిగిన 47వ జిఎస్‌టి (పన్నుల విధింపు) సమావేశంలో పాలు, పాల ఉత్పత్తులపై భారాలు మోపారు. ఇంత వరకు పాలు, పెరుగు, లస్సీ, మజ్జిగ ఉత్పత్తులపై ఎలాంటి పన్ను లేదు. వాటిపై 5 శాతం నుండి 12 శాతానికి జిఎస్‌టి పన్ను పెంచుతూ నిర్ణయిం తీసుకున్నారు. పాల ఉత్పత్తిలో వినియోగించే యంత్రాలకు 12 శాతం నుండి 18 శాతానికి జిఎస్‌టిని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దేశంలో 9 కోట్ల కుటుంబాలు అదనపు భారం భరించాల్సి ఉంటుంది. వ్యవసాయ ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు పెంచమని, రైతులకు లాభం చేస్తామని, వారి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రగల్భాలు పలికిన మోడీ ప్రభుత్వం మాట మార్చి పన్నుల భారంతో విరుచుకు పడింది. చివరికి పాల దిగుమతులకు అవకాశాలు కల్పిస్తూ స్వదేశీ పాల ఉత్పత్తులపై భారాలు మోపింది. 2020-21 గణాంకాలు పరిశీలిస్తే 20.10 కోట్ల టన్నుల ఉత్పత్తితో భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉంది.

సంవత్సరానికి 6.2 శాతం కాంపౌండిగ్ వృద్ధితో పెరుగుతున్నది. అమెరికా 10 కోట్ల టన్నులు, పాకిస్థాన్ 5.5 కోట్ల టన్నులు, బ్రెజిల్ 4.5 కోట్ల టన్నులు, 28 యూరోపియన్ దేశాలు 16.72 కోట్ల టన్నులతో ప్రపంచ ఉత్పత్తి 85 కోట్ల టన్నులుగా ఉంది. ప్రథమ స్థానంలో ఉన్న భారతదేశం పాల ఉత్పత్తిని దెబ్బ తీయడానికి అగ్ర రాజ్యాలు పన్నిన కుట్రలో భాగంగానే జిఎస్‌టి పెంచడం జరిగింది. ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్, అమెరికా దేశాల నుండి పాలు, పాల ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాము. మనిషి పుట్టినప్పటి నుండి వాడే వస్తువు నుండి మొదలుకుంటే మనిషి చనిపోయినప్పుడు ఉపయోగించే శవపేటిక వరకు వినియోగించే ప్రతి వస్తువుల మీద సేవల మీద జిఎస్‌టి అనే పేరుతో పన్నుల భారం పడుతుంది. భారత దేశంలో గేదె పాల ఉత్పత్తి 50 శాతం ఉంటుంది. ప్రపంచ వ్యాపితంగా ఆవు పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. నేటికీ తలసరి పాల వాడకం భారతదేశంలో రోజుకు సగటున 420 గ్రాములు ఉన్నది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో తలసరి రోజువారి వాడకం 1100 గ్రాములుంది. తెలంగాణలో పాల తలసరి వాడకం 320 గ్రాములకు మించ దు. స్థానిక వినియోగాన్ని పెంచడానికి ప్రభుత్వాలు పాలు, పాల ఉత్పత్తుల ధరలను తగ్గించి అందరికీ అందుబాటులో ఉంచాలి. కానీ ఎదో రూపంలో ఎప్పటికికప్పుడు ధరలు పెంచడం ఆనవాయితీగా వస్తోం ది. 2017 జులై నాటికి పాల ఉత్పత్తులపై ఎలాంటి పన్నులూ లేవు.

ఆ తరువాత పాలు, పెరుగు, మజ్జిగలను మినహయించి మిగిలిన వాటిపై 5 శాతం పన్ను లు వేశారు. వాటిపై 5 శాతం పన్ను పెంచారు. ప్యాకింగ్ చేసిన పాలపై పన్ను వేశారు. ఆమూల్ పాల వ్యాపారంపై 12 శాతం పన్ను విధించారు. ఆమూల్ వ్యాపార టర్నోవర్ రూ. 46000 కోట్లు ఉంది. సంవత్సరానికి 18 శాతం వృద్ధి రేటుతో పెరుగుతోంది. జిఎస్‌టి పెంపుతో వృద్ధి రేటుకు ఆటంకం ఏర్పాడుతుంది. పాల నుండి వెన్న తీసే యంత్రా లు, పాలలో వెన్న శాతం చూసే యంత్రాలు, పాలను పొడిగా మార్చే యంత్రాలు, వెన్న చీజ్ తయారు చేసే యంత్రాలకు 12 శాతం నుండి 18 శాతానికి జిఎస్‌టిని పెంచారు. ఈ విధంగా పెంచడంతో అకస్మాత్తుగా పాల ఉత్పత్తిదారులపై భారంపడి వారు వినియోగదారులపై భారం వేయాలి. ఈ ధరల పెరుగుదలతో వినియోగదారులు తమ వినియోగాన్ని తగ్గించుకుంటారు. ప్రతి వ్యక్తి రోజుకు కనీసం అర లీటర్ పాలు వినియోగించుకునే విధంగా పెంచాల్సిన ప్రభుత్వం, వారిని వినియోగం నుండి దూరం చేసే విధంగా ధరలను పెంచుతున్నది. భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించడానికి మోడీ ప్రభుత్వం చేసిన మూడు నల్ల చట్టాల ప్రయత్నాన్ని భారత రైతులు 13 నెలలు ఆందోళన చేసి ఉపసంహరించుకునేటట్లు చేశారు. కానీ ఏదో రూపంలో, పక్కదారుల ద్వారా నేటికీ మోడీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌లకు ధారాదత్తం చేయడానికే పూనుకొని ఉంది. అందులో భాగంగానే ‘కనీస మద్దతు ధరలు’ నామమాత్రంగా పెంచారు.

గత నెల 12- 15 మధ్య జరిగిన డబ్ల్యుటిఒ సమావేశాలలో ఎగుమతి సబ్సిడీలు ఇవ్వరాదని నిర్ణయించారు. ధనిక దేశాలు ఏదో పేరుతో (గ్రీన్‌బాక్స్, బ్లూబాక్స్, అంబర్‌బాక్స్) రాయితీలు కొనసాగిస్తూ అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ మధ్యనే జరిగిన జి7 దేశాల సమావేశంలో భారతదేశంపై రాయితీలు ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. ఇవన్నీ గత నెలలోనే సంభవించాయి. వాటి కొనసాగింపుగానే 47వ జిఎస్‌టి సమావేశంలో అన్ని ఉత్పత్తులపై ఇబ్బడి-ముబ్బడిగా పన్నులు పెంచేశారు. ప్రజల జీవనాదాయాన్నీ, వినియోగ సామర్థ్యాన్నీ తగ్గిస్తున్నారు. ఇప్పటికే దేశంలో ఐదేండ్లలోపు పిల్లలు పౌష్టికాహార లోపంతో 1000కి 40 మంది మరణిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 50 శాతం మహిళలు, యువకుల్లో రక్తహీనత ఉన్నట్లు స్పష్టమవుతోంది. అలాంటి స్థితిలో ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు’ పన్నుల భారంతో పాల వినియోగానికి ప్రజలను దూరం చేస్తున్నారు. ప్రపంచంలో పాలఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉండి కూడా దేశంలోని పౌరులకు పాలు అందించలేకపోవడం సిగ్గుచేటు.ప్రజారోగ్యం గురించి నిరంతరం మాట్లాడే ప్రధాని 47వ జిఎస్‌టి సమావేశంలో పన్ను ల భారం ఎందుకు పెంచినట్లు? ప్రజలేమైనా అధిక ఆదాయంతో తూగిపోతున్నారా? నేటికీ అతి దారిద్య్రరేఖ కింద 35 శాతం మంది, సాధారణ దారిద్య్రరేఖ కింద 75 శాతం ఉన్నట్లు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి కదా. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఆదా యం రెట్టింపు చేస్తుంటే కేంద్రం మాత్రం పన్నుల పేరు తో పేదలను దోపిడీ చేస్తున్నారు.

* లాకవత్ చిరంజీవి నాయక్- 99630 40960

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News