Friday, April 18, 2025

తమిళి సై రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదు: నారాయణ

- Advertisement -
- Advertisement -

CPI-Narayana

 

హైదరాబాద్: గవర్నర్‌గా తమిళి సై ఉంటూ రాజకీయాల గురించి మాట్లాడడం సరికాదని సిపిఐ నేత నారాయణ తెలిపారు. సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా? లేదన్నది రాజకీయాలకు సంబంధించిన విషయమని, గవర్నర్ సంబంధంలేదని చురకలంటించారు. సిఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తుండడంతో ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేస్తున్నారని గవర్నర్ తమిళి సై వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. దీంతో రాజకీయ ప్రముఖలు తమిళి సై వ్యాఖ్యలపై మండిపడుతున్నారు.  గవర్నర్ రాజకీయాలు గురించి మాట్లాడడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News