Friday, April 18, 2025

మక్తల్‌కు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు..

- Advertisement -
- Advertisement -

మక్తల్ : నియోజకవర్గ కేంద్రమైన మక్తల్ పట్టణంలో నూతనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జి.ఓ నెం.47ను విడుదల చేసింది. ప్రస్తుత విద్యా సంవత్సరం(2022—– 23)లోనే కళాశాలలో విద్యార్థుల ప్రవేశం, తరగతుల ప్రారంభానికి సంబంధించి అన్ని చర్యలు తీసుకొవాలని ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మక్తల్ ప్రాంత విద్యార్థులు, ప్రజల చిరకాల స్వప్నమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ప్రభుత్వం మంజూరు చేయడం పట్ల పట్టణ, పరిసర గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News