Friday, April 18, 2025

ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో శనివారం చోటు చేసుకుంది. వివరాల లోకి వెళితే..స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. శనివారం ఉదయం కూకట్ పల్లిలో ఇసుక లోడ్ దించుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది.

ఈ ఘటనలో ట్రాక్టర్ మీద పడి గోవింద్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం మృతదేహన్ని ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News