Saturday, September 21, 2024

మధ్యప్రదేశ్ నుంచి బిఆర్‌ఎస్‌లోకి చేరికలు

- Advertisement -
- Advertisement -

మధ్యప్రదేశ్ నుంచి బిఆర్‌ఎస్‌లోకి చేరికలు
సిఎం కెసిఆర్ సమక్షంలో పార్టీలో చేరిన బిజెపి పార్టీకి చెందిన మాజీ ఎంపి బుద్దసేన్ పటేల్
ఆయనను మధ్యప్రదేశ్ రాష్ట్ర బిఆర్‌ఎస్ పార్టీ కో ఆర్డినేటర్‌గా నియమించిన బిఆర్‌ఎస్ అధినేత
హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ పట్ల ఆదరణ, బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పట్ల విశ్వాసం, దినదిన ప్రవర్థమానమవుతూ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించుకున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, పలు పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు బిఆర్‌ఎస్ పార్టీ పట్ల, ఆ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతున్నారు. తెలంగాణ మోడల్ పాలన మాకూ కావాలనే బలమైన ఆకాంక్షతో పార్టీ అధినేత సిఎం కెసిఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకుంటున్న పరిస్థితి ప్రతీరోజూ కనిపిస్తున్నది. నిర్విరామంగా సాగుతున్న చేరికల పరంపరలో మంగళవారం నాడు మరో ముఖ్యఘట్టం చోటుచేసుకున్నది.

ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి చేరికలు జరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి బిఆర్‌ఎస్‌లోకి చేరికలు ప్రారంభమయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన మాజీ ఎంపి సహా మాజీ ఎంఎల్‌ఎలు పలువురు ప్రజా ప్రతినిధులు ప్రజల్లో పట్టువున్న ముఖ్యనేతలు బిఆర్‌ఎస్ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా పార్లమెంటరీ నియోజవర్గం బిజెపి పార్టీకి చెందిన మాజీ ఎంపి బుద్దసేన్ పటేల్ మంగళవారం పార్టీ అధినేత సిఎం కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి అధినేత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు బిఎస్‌సి పార్టీ నుంచి మాజీ ఎంఎల్‌ఎ డాక్టర్ నరేశ్ సింగ్ గుర్జార్, ఎస్‌పి పార్టీకి చెందిన సాత్నా మాజీ ఎంఎల్‌ఎ ధీరేంద్ర సింగ్, సాత్నా మాజీ జిల్లా పంచాయత్ సభ్యులు విమల బాగ్రి, సర్వజన్ కళ్యాణ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, భోపాల్‌కు చెందిన రాకేశ్ మాల్వీయ, సత్యేంద్ర సింగ్ తదితరులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

కాగా, పార్టీలో చేరిన మాజీ ఎంపి బుద్ధసేన్ పటేల్‌ను మధ్యప్రదేశ్ రాష్ట్ర బిఆర్‌ఎస్ పార్టీ కో ఆర్డినేటర్‌గా జాతీయ అధ్యక్షులు సిఎం కెసిఆర్ నియమించారు. కాగా, తాము మధ్యప్రదేశ్‌కు తిరిగివెళ్లిన తర్వాత ఇప్పటికే ఆసక్తితో ఎదురుచూస్తున్న అక్కడి ప్రజలు నేతలతో సమావేశమై విస్తృతంగా చర్చించనున్నట్టు పార్టీలో చేరిన నేతలు తెలిపారు. తెలంగాణ మోడల్ పాలనకోసం మధ్యప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడానికి సిద్దంగా వున్నట్టు వారు తెలిపారు. త్వరలోనే తిరిగి హైదరాబాద్‌కు వచ్చి భారీ సంఖ్యలో బిఆర్‌ఎస్‌లో చేరుతామని అన్నారు. కాగా….అనంతరం భూపాల్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని సభకు అధినేత కెసిఆర్‌ను రావాల్సిందిగా వారు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో చెన్నూర్ ఎంఎల్‌ఎల బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: ఓఆర్‌ఆర్ అవకతవకలపై సిఎంకు బండి సంజయ్ బహిరంగ లేఖ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News