Friday, April 11, 2025

ఎయిర్ ఇండియా విమానంలో మరోసారి మూత్ర విసర్జన సంఘటన

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా గత కొన్ని రోజులుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటోంది. తరచూ మూత్ర విసర్జన ఘటనలతో వార్తల్లోకెక్కుతోంది. జూన్ 24న ఏఐసి 866 విమానంలో మూత్ర విసర్జన సంఘటన జరిగింది. సీటు నెంబర్ 17 ఎఫ్‌లో ప్రయాణిస్తున్న రామ్‌సింగ్ అనే వ్యక్తి తన సీటులో మూత్ర విసర్జన చేయడంతోపాటు ఉమ్మివేశాడు. దీంతో విమాన సిబ్బంది హెచ్చరించి ప్రయాణికులకు దూరంగా కూర్చోబెట్టారు. విమానం ఢిల్లీకి చేరగానే అతడిని సెక్యూరిటీ సిబ్బంది పోలీస్‌లకు అప్పగించారు. పలుసెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News