Thursday, April 10, 2025

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెజ్జూరు: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని కృష్ణపల్లి గ్రామంలో ఉరి వేసుకోని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం రా త్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం చౌదరి జయరాం (48) తాగుడుకు బానిసై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి వాసానికి ఉరి వేసుకొని అత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య నానబాయి తెలిపారు.

బెజ్జూరు పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్యతో పాటు ఒక కుమారుడు, ఒక కుతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News