Tuesday, September 17, 2024

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

అమరావతి: శ్రీకాళహస్తి ఏర్పేడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తిరుమల నుంచి శ్రీకాళహస్తికి వస్తున్న ఓ కారు అదుపుతప్పి మిట్టకండ్రిగ వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటనాస్థానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని దవాఖానాకు తరలించారు. బాధితులు బెజవాడకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News