Sunday, September 22, 2024

తాతయ్యే నాకు స్ఫూర్తి

- Advertisement -
- Advertisement -

దాదాపు కోటి రూపాయలు నిధులు సేకరించి గౌలిదొడ్డి సర్కారు బడికి జీవం పోసిన హిమాన్షు
హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా అధునాతన హంగులతో తీర్చిదిద్దిన సర్కారు బడిని ప్రారంభించిన
విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్/శేర్‌లింగంపల్లి/ గచ్చిబౌలి: గౌలిదొడ్డిలోని కేశవనగర్ ప్రభుత్వ పా ఠశాలను తొలిసారి సందర్శించినప్పుడు కళ్లళ్లో నీ ళ్లు వచ్చాయని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు పేర్కొన్నారు. అప్పుడే అందరిలా కాకుండా ఎక్స్‌ట్రార్డినరీగా చేయాలనుకున్నానని చెప్పారు. ఎందుకంటే కెసిఆర్ మనువడిని కదా.. ఏదైనా నార్మల్‌గా చేసే అలవాటు లేదని హిమాన్షు పేర్కొన్నారు. కల్వకుం ట్ల హిమాన్షు దాదాపు కోటి రూపాయల నిధులు సేకరించి సర్కారు బడికి జీవం పోశారు. అధునాత న హంగులతో తీర్చిదిద్దిన ఈ బడిని హిమాన్షు పు ట్టినరోజు సందర్భంగా బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా హిమాన్షు మాట్లాడుతూ.. పబ్లిక్‌లో మాట్లాడటం ఇది ఫస్ట్ టైం…కొత్త వాళ్లతో మాట్లాడుతున్నట్లుగా లేదు…నా కుటుంబంతో మా ట్లాడుతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు.

ఈ రెండేండ్ల కాలంలో 20 నుంచి 30 సార్లు స్కూల్‌ను సందర్శించానని, రాత్రి సమయాల్లో వచ్చి కూడా పనులను పర్యవేక్షించానని చెప్పారు. 2022లో క్లాస్ ప్రెసిడెంట్ అయినప్పుడు ఈ స్కూల్‌ను తన క్లాస్ కో ఆర్డినేటర్ సూచనతో విజట్ చేశానని తెలిపారు. స్కూల్ చుట్టూ గోడలు కట్టి గేట్లు ఏర్పాటు చేయాలని తన క్లాస్ కో ఆర్డినేటర్ సూచించారని, అలా స్కూల్‌ను విజిట్ చేసిన తర్వాత ఇక్కడున్న పరిస్థితులను చూసి చలించిపోయానని అన్నారు. డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాలనుకున్నాం… క్లాస్ రూమ్‌లో తినేసరికి ఆ స్మెల్‌కు పురుగులు జమవుతున్నాయని పేర్కొన్నారు. తొలిసారిగా స్కూల్‌ను వచ్చినప్పుడు 10 వేల మొక్కలు నాటాం…. ఆ కా ర్యక్రమంతో సంతృప్తి చెందలేదని చెప్పారు. చెట్లు పెట్టే కార్యక్రమం ఎవరైనా చేస్తారు.. మనం కొత్త గా చేయాలని చెప్పానని… స్కూల్‌కే ఒక పేరు తేవాలనుకున్నామన్నారు. క్లాస్ రికార్డులో బెంచ్ మార్క్ సెట్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

పాఠశాల పరిస్థితిని చూసి కన్నీళ్లు వచ్చాయి
స్కూల్ కండీషన్ చూసిన తర్వాత ఆ బాధను మాటల్లో చెప్పుకోలేకపోయామని, కళ్లల్లోకి నీళ్లు వచ్చాయని పేర్కొన్నారు. ఆడపిల్లలకు సరైన బాత్‌రూమ్ లు లేకుండే… రాళ్ల మధ్యలో పిల్లలు ఆడుకుంటున్నారని గుర్తు చేసుకున్నారు. తాను వచ్చిన రోజే ఓ పిల్లాడు మెట్లపై నుంచి జారిపడి దెబ్బ తగిలించుకున్నాడని వాపోయారు. ఆ పరిస్థితిని చూసిన తర్వా త అన్ని క్లాస్ రూమ్స్ తిరిగి… ఫర్నీచర్‌ను పరిశీలించామని, హెడ్ మాస్టర్ రూమ్‌లోనే క్లాస్ రూం, స్టోర్ రూమ్‌ను చూసి షాకయ్యానని అన్నారు. ఇ లా చూడడం తనకు కొత్త అని వ్యాఖ్యానించారు. మొత్తానికి రూ. 40 లక్షలు ఫండ్ వసూలు చేశామ ని, సిఎస్‌ఆర్ ఫండ్ కూడా కంట్రిబ్యూట్ చేశారని తెలిపారు. పేదరికాన్ని అరికట్టే ఉపాయం చదువుకున్న సమాజానికి ఉంటుందని తన తాత ఎప్పు డూ చెప్పేవారని… తన చదువులో గ్రేడ్ తగ్గినా.. వంద మందికి మంచి చేసే అవకాశం ఉంటే చేయాలని తన నాన్న కూడా చెప్పారని పేర్కొన్నారు. తన తాత ప్రేరణ, తన తండ్రి ఆశీస్సులతో ఈ స్కూల్‌లో చాలా కార్యక్రమాలు చేశామని వివరించారు.

ఈ స్కూల్లో చదివే పిల్లలందరూ పేదవారని,కూలీ పనులు చేసుకునే కుటుంబాలకు చెందినవారే అని పేర్కొన్నారు. ఈ స్కూల్ పిల్లల్లో భవిష్యత్తులో ఇంజినీర్లను, డాక్టర్లను, లాయర్లను చూడాలని…వారిలో పొలిటిషీయన్లను చూడాలని ఆకాంక్షించారు. భ విష్యత్‌లో కూడా తప్పకుండా అన్ని విధాలా అం డగా ఉంటాం అని హిమాన్షు స్పష్టం చేశారు. ప్ర భుత్వ విప్, శేరిలింగంపల్లి ఎంఎల్‌ఎ అరికెపుడి గాంధీ, కార్పోరేటర్ గంగాధర్ రెడ్డి, ఒక్రిడ్జి ఇంటర్నేషనల్ పాఠశాల ప్రి న్సిపాల్ దీపికా రావు, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, గచ్చిబౌలి డివిజన్ బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పార్టీ నా యకులు ప్రగడ సత్యనారాయ ణ, జంగయ్య యాదవ్, సురేందర్, నరేష్, సురేష్ నాయక్, నగేష్, శ్రీనివాస్, అక్బర్ బాయి, సల్లావుద్దిన్, శ్యామ్, శ్రీనివాస్, పింటు, సీఏఎస్ కో ఆర్డినేటర్, ఇతర టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News