Saturday, April 12, 2025

పరీక్షలో కొడుకు ఫెయిల్.. తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కొడుకు పరీక్షలో ఫెయిల్ అయ్యాడని మనస్థాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గాజులరామారంలోని బాలాజీ నగర్ ఎంక్లేవ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్ప జ్యోతి(41) అనే మహిళ.. తన భర్త, ఇద్దరు కుమారులతో కలిసి బాలాజీ నగర్ ఎంక్లేవ్ లో నివాసం ఉంటోంది. ఇద్దరు కుమారుల్లో ఒకరు చార్టర్డ్ అకౌంట్(సిఎ) కోర్సు చేస్తున్నాడు.

అయితే, ఇటీవల జరిగిన సిఎ పరీక్షలో తన కుమారుడు ఫెయిల్ అవ్యడంతో పుష్ప జ్యోతి మనస్థాపానికి గురైంది. కొడుకు భవిష్యతుపై ఆందోళన చెందిన ఆమె బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News