Sunday, April 13, 2025

తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం  31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి చూస్తున్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

కాగా, గురువారం శ్రీవారిని 64,695 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలలో నిన్న 24,473మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.60కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News