Saturday, April 19, 2025

జొహన్స్‌బర్గ్‌లో అగ్ని ప్రమాదం: 63 మంది మృతి

- Advertisement -
- Advertisement -

జొహన్స్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలోని జొహన్స్‌బర్గ్‌లో గురువారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఐదు అంతస్థుల భవనంలో భారీగా మంటలు చెలరేగడంతో 63 మంది మృతి చెందగా 40 మంది పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆ ఆపార్ట్‌మెంట్‌లో దాదాపుగా 200 మంది వరకు నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు. షార్ట్ సర్కూట్‌తోనే ఈ ప్రమాదాలు జరిగి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News