Tuesday, October 22, 2024

లారీని ఢీకొట్టిన మినీ వ్యాన్: ఏడుగురు స్పాట్ డెడ్

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడులోని తిరుప్పత్తూరు వద్ద సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్‌ అదుపుతప్పి రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్‌లో పది మంది ఉన్నారని, ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారని, మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరారని తిరుప్పత్తూరులోని పోలీసు వర్గాలు తెలిపాయి. మృతులు వేలూరు జిల్లా ఒనంకుట్టి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. పేర్లతో సహా మరిన్ని వివరాలను తర్వాత తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News