Tuesday, October 22, 2024

మహిళపై అత్యాచారం… హెడ్‌కానిస్టేబుల్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అత్యాచారం చేసిన కేసులో హెడ్ కానిస్టేబుల్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంఘటన ఢిల్లీలోని జాహంగీర్‌పూరీ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ మహిళను బల్విందర్ అనే హెడ్ కానిస్టేబుల్ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపై అతడు అత్యాచారం చేయడంతో ఆమె మహేంద్ర పార్క్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి హెడ్ కానిస్టేబుల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సదరు మహిళను ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Also Read: బెంగళూరు కంటే ఎక్కువ ఐటి ఉద్యోగాలు కల్పిస్తున్నాం: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News