Friday, September 20, 2024

అన్ని వర్గాలను బాబు మోసం చేశారు: వైవి సుబ్బారెడ్డి

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వర్గాలను మోసం చేశారని వైసిపి నేత వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. జన్మభూమి కమిటీల ద్వారా ఇష్టం వచ్చినట్లుగా దోచుకున్నారని ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని దుయ్యబట్టారు. టిడిపి నేతలు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, ఆ దుష్ప్రచారాలను ప్రజలే తిప్పి కొట్టాలని వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గత నెల రోజుల నుంచి బాబు జైలు జీవితం గడుపుతున్నారు.

Also Read: చంద్రబాబు ఆరోగ్యంపై ఎగతాళిగా మాట్లాడటం సరికాదు: రామకృష్ణ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News