Saturday, September 21, 2024

గత ఏడాది ఏడు కోట్ల మందికి టీబి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : క్షయ వ్యాధి (టిబి)కి సంబంధించి 2022 సంవత్సరం ప్రమాద ఘంటికను వెలువరించింది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా మొత్తం మీద 7 కోట్ల 50 లక్షల మందికి క్షయవ్యాధి సోకినట్లు నిర్థారణ అయింది. 1995లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) ప్రపంచ వ్యాప్తంగా టిబి పర్యవేక్షణ ఆటకట్టు కార్యక్రమం చేపట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ చూస్తే 2022 సంవత్సరంలోనే టిబి నిర్థారిత వ్యక్తుల సంఖ్య అత్యధికంగా ఉన్నట్లు రికార్డు అయింది. 192 దేశాలు , ప్రాంతాల్లోని పరిణామాలను తీసుకుని ఈ టిబి గణాంకాలను వెల్లడించారు. అయితే ఇదే సంవత్సరంలో టిబి చికిత్స విషయంలో పురోగతి కన్పించింది. అంతకు ముందటి కోవిడ్ , లాక్‌డౌన్ల దశల్లో టిబి నివారణ సేవలకు ఏర్పడ్డ అంతరాయాలను తట్టుకుని , చికిత్సలలో ముందడుగు వేసినట్లు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News