Saturday, September 21, 2024

15 స్థానాల్లో ఆర్‌పిఐ బరిలో నిలుస్తుంది: కేంద్రమంత్రి రామదాస్ అథవాలే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ జరిగే ఎన్నికల్లో తమ పార్టీ 15 స్ధానాల్లో పోటీ చేస్తుందని ‘రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా’ అధ్యక్షులు, కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే తెలిపారు.  సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మిగతా చోట్ల బిజెపికి మద్దతు ఇస్తామని, తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకు రాష్ట్ర ప్రజలు మద్దతు పలకాలని కోరారు. ఎల్బీనగర్, వర్ధన్నపేట, మల్కాజిగిరి, తుంగతుర్తి, ఉప్పల్, డోర్నకల్, జహీరాబాద్, సిరిసిల్లా, అదిలాబాద్, సత్తుపల్లి, మహబూబాబాద్, వరంగల్, మేడ్చల్, పరకాల, సిద్దిపేట నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు బరిలో నిలుస్తున్నట్లు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News