Wednesday, October 23, 2024

రుచికరమైన భోజనం వండిపెట్టలేదని తల్లిని చంపిన తనయుడు

- Advertisement -
- Advertisement -

ముంబయి: భోజనం రుచికరంగా వండిపెట్టలేదని కన్నతల్లిని తనయుడు హత్య చేసిన సంఘటన మహారాష్ట్రలోని థాణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ముర్దాబాద్ తాలూకా వెలు గ్రామంలో కుమారుడు తన తల్లితో కలిసి ఉంటున్నాడు. రుచికరమైన భోజనం వండలేదని తల్లితో కుమారుడు గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో తల్లిపై కొడవలితో దాడి చేయడంతో చనిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కుమారుడు నిద్రమాత్రలు మింగానని చెప్పడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఇప్పటి వరకు అతడిని అరెస్టు చేయలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News