Friday, October 18, 2024

స్మితా సభర్వాల్‌కు నీటిపారుదల శాఖ బాధ్యతలు..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం స్మితా సభర్వాల్‌కు నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగించింది. నవంబర్ 30న రాష్ట్ర నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ సర్వీస్ ముగియనున్న విషయం తెలిసిందే. దీంతో గురువారం రజత్‌ కుమార్‌ పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో స్మితా సభర్వాల్‌ను ఆ శాఖ కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలతో (ఎఫ్‌ఏసీ) ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం స్మితా సభర్వాల్‌ సీఎం కార్యదర్శి ఉన్నారు. రాష్ట్ర నీటి పారుదల శాఖతోపాటు పునరావాసం, భూసేకరణ విభాగ డైరెక్టర్‌ బాధ్యతలు కూడా ఆమెకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News